News March 30, 2024

భీమిలిలో రోడ్డు ప్రమాదం వివాహిత మృతి

image

మండలంలోని సంగివలస మూడు అమ్మవార్ల గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. అనకాపల్లికి చెందిన చంద్రతేజాదేవి (24)కి భీమిలి మండలానికి చెందిన గంగడ పైడిరాజుకి గత నెలలో వివాహం అయింది. వీరు మద్దిలపాలెంలో నివాసముంటున్నారు. ఈరోజు సింగనబంద అమ్మవారిని దర్శించుకుని బైక్‌‌పై తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అమె అక్కడికక్కడే మృతి చెందినట్లు భీమిలి సీఐ డీ.రమేశ్ తెలిపారు.

Similar News

News September 9, 2025

పోక్సో కేసులో ముద్దాయిని పట్టుకున్న మహారాణిపేట పోలీసులు

image

మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో ముద్దాయి షేక్ అబ్దుల్ కలాం 18 నెలల నుంచి కోర్టుకు హాజరు కావడం లేదు. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసులు హైదరాబాద్, అనంతపురం జిల్లాలో విస్తృతంగా గాలించారు. సెల్‌ఫోన్ కూడా ఉపయోగించకుండా తిరుగుతున్న ముద్దాయిని మంగళవారం చాకచక్యంగా పట్టుకోవడంతో సిబ్బందిని సీపీ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.

News September 9, 2025

విశాఖ: ‘అధ్యయన యాత్రలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’

image

జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్రలపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. 2021 నుంచి ఇప్పటివరకు 4 సార్లు అధ్యయన యాత్రలకు వెళ్లారని తెలిపారు. ఈనెల 15 నుంచి 23 వరకు మరోసారి అధ్యయన యాత్ర కోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేందుకు జీవీఎంసీ సిద్ధమైందన్నారు. గతంలో జరిగిన అధ్యయన యాత్రలు విహారయాత్రలుగా మిగిలాయన్నారు.

News September 9, 2025

కేజీహెచ్‌లో సిట్ విచారణ..?

image

సృష్టి కేసులో కేజీహెచ్‌ వైద్యుల వ్యవహారం నిగ్గు తేల్చేందుకు సిట్ రెండు రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. కేజీహెచ్‌లో పనిచేసిన ముగ్గురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో సిట్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లా వైద్యశాఖ నుంచి తెలంగాణ సీట్ పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం.