News March 30, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ సుల్తానాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య. @ వేములవాడలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు. @ సైదాపూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పంజాబ్ లో మృతి. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడలో వైభవంగా రాజన్న రథోత్సవం. @ నీటిని విడుదల చేయాలని కథలాపూర్ మండలంలో రైతుల ధర్నా. @ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు.
Similar News
News April 22, 2025
కరీంనగర్: తేలనున్న 35,562 మంది భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. KNR జిల్లాలో మొత్తం 35,562 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,799 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 22, 2025
కరీంనగర్: ఓపెన్ పదో, ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

కరీంనగర్ జిల్లాలో సోమవారం ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు తెలిపారు. పదో తరగితి పరీక్షకు 3 పరీక్షా కేంద్రాల్లో 410 మందికి 375 మంది, ఇంటర్ పరీక్షకు 4 పరీక్షా కేంద్రాల్లో 908 మందికి 839 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 టెన్త్ పరీక్ష కేంద్రాలో మొత్తం 62 మందికి 52 మంది హాజరైనట్లు పరీక్ష ఓపన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు.
News April 22, 2025
KNR: పప్పు ధాన్యాల సాగుపై రైతుల అనాసక్తి!

ఉమ్మడి KNR జిల్లాలో పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతుంది. మినప, పెసర, కంది, పల్లి, ఇతర పంటలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. వేలాది ఎకరాల్లో సాగయ్యే పప్పు ధాన్యాల పంట నేడు గణనీయంగా తగ్గిపోయింది. యాసంగి సాగు తరువాత మినప, పెసర పంటలు వేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు ఆదాయం కూడా వస్తుంది. అధికారులు చర్యలు తీసుకోని రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే ఈ పంటలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.