News August 4, 2025
GNT: అక్కడ ఆడొద్దు సరే.. మరి ప్రత్యామ్నాయం

ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువ శాతం సెల్ ఫోన్లో ఆటలకు పరిమితం అవుతున్నారు. కొంత మంది పిల్లలు మాత్రం క్రికెట్ మీద మక్కువతో మైదానాలలో, కొన్ని ప్రభుత్వ ప్రదేశాలలో ఆడుతూ ఉంటారు. అయితే అభివృద్ధి, మరికొన్ని కారణాల చేత అక్కడ పిల్లలు ఆడుకోవటానికి వీలు లేకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడలు కనుమరుగు అవ్వకుండా స్థానికంగా మైదానాలు ఏర్పాటు చెయ్యాలని క్రీడా కారులు కోరుతున్నారు. దీనిపై మీ COMMENT.
Similar News
News September 9, 2025
జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.
News September 9, 2025
తాడేపల్లిలో రేపు జగన్ మీడియా సమావేశం

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూముల దోపిడీ వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
News September 9, 2025
అమరావతికి మరో ప్రముఖ సంస్థ

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు