News August 4, 2025

రూ.5కే టిఫిన్.. మెనూ ఇదే

image

TG: GHMC పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే అల్పాహారం అందించనుంది. ఒక్కో ప్లేటుకు ₹19 ఖర్చు కానుండగా, అందులో లబ్ధిదారుల నుంచి రూ.5 వసూలు చేస్తారు. ప్రభుత్వం ₹14 భరిస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించి మెనూ విడుదలైంది. తొలి రోజు మిల్లెట్ ఇడ్లీ, రెండో రోజు మిల్లెట్ ఉప్మా, డే3: పొంగల్, డే4: ఇడ్లీ, డే5: పొంగల్, డే6: పూరి (3), ఆలు కుర్మా పెడతారు. చట్నీ, సాంబార్ ఉంటాయి.

Similar News

News August 16, 2025

‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ ఆందోళన.. మీ కామెంట్?

image

TG: <<17419574>>మార్వాడీలు<<>> వ్యాపారం చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు వేగంగా విస్తరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అని నినదిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కడైనా నివసించే, వ్యాపారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. క్వాలిటీతో పాటు మంచి సర్వీస్ అందిస్తే ఎవరికైనా లాభాలు వస్తాయంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News August 16, 2025

దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారు.. KCRపై రేవంత్ సెటైర్

image

TG: దేశానికి నాయకత్వం వహించాలనే దురాశతో ఉన్నది పోగొట్టుకున్నారని సీఎం రేవంత్ BRS చీఫ్ KCRపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తెలంగాణ పేరు, పేగు బంధం కూడా తెంచుకున్నారని తెలిపారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మారుస్తానని, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యంతో పేదల ఆత్మగౌరవాన్ని పెంచామని ఓ పుస్తకావిష్కరణ సభలో చెప్పారు.

News August 16, 2025

బ్రెవిస్‌కు ఎక్స్‌ట్రా పేమెంట్.. CSK క్లారిటీ

image

IPL-2025లో ఆడేందుకు <<17405212>>బ్రెవిస్‌కు<<>> ఎక్స్‌ట్రా పేమెంట్ ఇచ్చారన్న మాజీ క్రికెటర్ అశ్విన్ వ్యాఖ్యలపై CSK స్పందించింది. ‘టోర్నీ నియమాలకు లోబడే గాయపడిన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ను తీసుకున్నాం. రూల్ ప్రకారం రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌కు ఇంజూర్డ్ ప్లేయర్‌కు ఇవ్వాల్సిన ఫీ కంటే ఎక్కువ ఇవ్వొద్దు. దాని ప్రకారమే వేలంలో గుర్జప్నీత్‌ను కొన్న ధరనే (₹2.2Cr) బ్రెవిస్‌కు చెల్లించాం’ అని స్పష్టం చేసింది.