News August 4, 2025
రాజమండ్రి: అన్నదాత సుఖీభవ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ పి.ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన కింద తొలి విడతలో నిధులు జమకాని రైతుల వివరాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ నిధులు అందేలా చూడాలని సూచించారు.
Similar News
News August 6, 2025
రాజమండ్రి: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి. ప్రశాంతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజమండ్రిలో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. 2026 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను అనుసరించి, వారికి సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
News August 6, 2025
తూ. గో జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

అసాంఘిక కార్యకలాపాలను అణిచివేసేందుకు మంగళవారం తూ.గో జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జోనల్ డీఎస్పీలు, సిబ్బంది టీములుగా ఏర్పడి తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటు సారా, నంబర్, రికార్డులు లేని 193 ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నరసింహకిశోర్ హెచ్చరించారు.
News August 6, 2025
ప్లాట్ల క్రమబద్ధీకరణకు గడువు పొడగింపు: కలెక్టర్

అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం జీవో నంబర్ 134 ద్వారా అవకాశం కల్పించిందని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. అనధికార లేఅవుట్లలో జూన్ 30, 2025 నాటికి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు సులభతరంగా స్వీయ ధ్రువీకరణ అంగీకార పత్రం సమర్పించి భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉందన్నారు.