News March 31, 2024
నిజామాబాద్ ఎంపీగా గెలిపించాలి: జీవన్ రెడ్డి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నికల సన్నహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News September 9, 2025
NZB: చేపలు పట్టేందుకు వెళ్లి.. చెరువులో పడి మృతి

సిరికొండ మండలం కొండాపూర్ గోప్య తండా పరిధిలోని గంటతాండలో విషాదం నెలకొంది. చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లిన శంకర్ (60) చెరువులో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ చేపల వేటకు వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో వెతకగా, అతని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 9, 2025
శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54,545 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 8 వరద గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 19,000, కాకతీయ 5,500, ఎస్కేప్ 2,500, సరస్వతి 800, లక్ష్మి 200, అలీసాగర్ 360, గుత్ప 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 80.501 TMC నీరుంది.
News September 9, 2025
NZB: మూడేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

NZBలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మూడేళ్ల చిన్నారికి అరుదైన గుండె ప్రొసీజర్ విజయవంతమైంది. పుట్టిన వెంటనే సహజంగా మూసుకుపోవాల్సిన రక్తనాళం తెరుచుకొని ఉండటంతో చిన్నారి తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ క్రమంలో వైద్యులు శస్త్రచికిత్స చేయకుండా ప్రత్యేక గుండె ప్రొసీజర్ ద్వారా రంద్రం మూసేసినట్లు Dr. సందీప్ రావు, సదానంద రెడ్డి ప్రకటించారు. చిన్నారికి సకాలంలో సరైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.