News August 4, 2025

YCP పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసింది: పెమ్మసాని

image

ఎన్నికల సమయంలో వైసీపీ తనకు పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసిందని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2019లో రాజ్యసభ, గుంటూరు పార్లమెంట్, నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసిన విషయం చాలా మందికి తెలియదని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన ఐడియాలజీకి సూట్ కానీ పార్టీ వైసీపీ అని తెలిపారు. తనకున్న విధేయత, ఓ కార్యకర్తలా చాలా రోజుల నుంచి కష్టపడ్డాను కాబట్టి తనకు టికెట్ దక్కిందన్నారు.

Similar News

News September 9, 2025

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

image

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.

News September 9, 2025

తాడేపల్లిలో రేపు జగన్ మీడియా సమావేశం

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూముల దోపిడీ వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

News September 9, 2025

అమరావతికి మరో ప్రముఖ సంస్థ

image

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు