News August 4, 2025
ADB: ‘సమస్యల పరిష్కారానికి కృషి’

ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థుల సమస్యలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, త్వరలో సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News August 6, 2025
ఆదిలాబాద్: కృష్ణ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సూచన

విజయవాడ డివిజన్లో లైబీ బ్లాక్ కారణంగా ADB నుంచి తిరుపతి వరకు నడిచే కృష్ణ ఎక్స్ ప్రెస్ను కొద్దీ రోజులు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 17406 ADB నుంచి తిరుపతి నడిచే రైలు ఈనెల 8,10,12 తేదీలలో రెండు గంటలు ఆలస్యంగా ఉంటుందన్నారు. రైలు నంబర్ 17405 తిరుపతి నుంచి ADB నడిచే రైలు ఈనెల 13 నుంచి 19 వరకు రద్దు, 17406 ADB నుంచి తిరుపతి ఈనెల 14 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నామన్నారు.
News August 6, 2025
ఆదిలాబాద్: ‘ఆకతాయిల వేధిస్తే షీ టీంను సంప్రదించండి’

ఆకతాయిల వేధింపులకు గురైతే వెంటనే షీ టీం నంబర్ 8712659953కు సంప్రదించాలని షీ టీం ఇన్ఛార్జ్ ఏఎస్ఐ సుశీల సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్లోని సరస్వతి శిశు మందిర్లో విద్యార్థులకు షీ టీం సేవలపై ఆమె అవగాహన కల్పించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, హెల్ప్లైన్ నంబర్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది వాణిశ్రీ, మహేష్, మోహన్ పాల్గొన్నారు.
News August 6, 2025
తాంసి: ఒకరికి షోకాజ్ నోటీసులు

తాంసి PHCని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఒకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రిజిష్టర్ పరిశీలించి గైర్హాజరైన వారి వివరాలు డాక్టర్ను ఫోన్లో ద్వారా తెలుసుకున్నారు. తను అర్బన్ హెల్త్ సెంటర్ హమాలివాడలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో పాల్గొన్నట్లు వైద్యులు శ్రావ్య వాణీ తెలిపారు. తాంసీ పీహెచ్సీలో విధులకు గైర్హాజరైన జూనియర్ అసిస్టెంట్ తేజకు షోకాస్ నోటీస్ జారీ చేశారు.