News August 4, 2025

కృష్ణా: ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

image

మచిలీపట్నం: జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పీజీఆర్‌ఎస్‌ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు కవాతు మైదానంలో అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. శాఖలు త‌మ బాధ్యత‌ల‌ను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

Similar News

News September 5, 2025

కృష్ణా: యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

image

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యూరియా ఇతర అవసరాలకు మళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. PACSల ద్వారా మాత్రమే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ నిరంతరం PACSలను సందర్శిస్తూ సరఫరా తీరును పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి 500 టన్నుల యూరియాను జిల్లాకు రప్పించారు.

News September 5, 2025

కృష్ణా: యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

image

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యూరియా ఇతర అవసరాలకు మళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. PACSల ద్వారా మాత్రమే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ నిరంతరం PACSలను సందర్శిస్తూ సరఫరా తీరును పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుంచి 500 టన్నుల యూరియాను జిల్లాకు రప్పించారు.

News September 5, 2025

ఉమ్మడి కృష్ణా నుంచి జాతీయ అవార్డులు పొందేది వీరే..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. మైలవరం లక్కిరెడ్డి హనుమ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి దేవానంద్ కుమార్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రొఫెసర్ విజయలక్ష్మి కాశీనాథ్ ఢిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందుకోనున్నారు.