News August 5, 2025
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా చంద్రారెడ్డి బాధ్యతలు

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంగరకలాన్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించగా, ప్రస్తుతం ప్రతిమా సింగ్ మెటర్నిటీ సెలవుల్లో ఉండడంతో చంద్రారెడ్డిని జిల్లా అదనపు కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News September 15, 2025
HYD: గొర్రెల స్కామ్ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.
News September 15, 2025
హైదరాబాద్కు ‘మోక్షం’ ప్రసాదించారు

1908..HYD మరిచిపోలేని ఏడాది. మూసీలో భారీ వరదలు వేలమందిని బలిగొన్నాయి. మరోసారి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909లో ద్విముఖ వ్యూహం రచించారు. అదే మూసీ ప్రాజెక్ట్. వరదల నియంత్రణ, తాగునీటి కష్టాలు తీర్చేలా ట్వీన్ రిజర్వాయర్స్ ఆయన ఆలోచనల నుంచే పుట్టాయి. టెక్నాలజీ పెద్దగా లేనప్పుడే నేటికి చెక్కుచెదరని పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థ HYDకు అందించారు. నేడు ఆ మహాజ్ఞాని జయంతి సందర్భంగా స్మరించుకుందాం.
News September 15, 2025
HYDలో భారీ వరద.. రంగంలోకి మేయర్

అతి భారీ వర్షానికి నగరంలోని బస్తీలు, కాలనీలతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున వరదనీరు నిలిచిపోయి రాకపోకలు స్తంభించడంతో నగర మేయర్ విజయలక్ష్మి రాత్రి అక్కడ పర్యటించారు. మోటార్ల సహాయంతో నీటిని తోడేయాలని, రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.