News August 5, 2025

42% రిజర్వేషన్ల కోసం నేటి నుంచి ఢిల్లీలో నిరసనలు

image

TG: BCలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఆర్డినెన్స్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని యోచిస్తోంది. ఇవాళ పార్లమెంటులో కాంగ్రెస్ MPలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతారు. 7న CM, మంత్రులు, MPలు, MLAలతో సహా 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.

Similar News

News August 5, 2025

దేశంలో 60% సంపద 1% కుబేరుల చేతుల్లోనే..

image

భారతదేశ సంపదలో 60% కేవలం ఒక శాతం సంపన్నుల దగ్గరే ఉందని అమెరికాకు చెందిన Bernstein రిపోర్ట్ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కుటుంబాల సంపద $19.6 ట్రిలియన్లు కాగా అందులో $11.6 ట్రిలియన్లు కుబేరుల వద్దే ఉందని తెలిపింది. ఇందులో $2.7 ట్రిలియన్ల సంపద మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీలు, బ్యాంకుల్లో పెట్టుబడులుగా పెట్టగా, మిగతా $8.9 ట్రిలియన్లు రియల్ ఎస్టేట్, బంగారం, నగదు రూపకంగా ఉంచారని చెప్పింది.

News August 5, 2025

ఉదయం పెళ్లి.. రాత్రి నవ వధువు ఆత్మహత్య

image

AP: సత్యసాయి జిల్లాలో ఓ నవ వధువు శోభనం గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సోమందేపల్లికి చెందిన హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన నాగేంద్రతో నిన్న ఉదయం వివాహం జరిగింది. యువతి ఇంట్లో కుటుంబసభ్యులు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి ఆమె ఉరేసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

News August 5, 2025

ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్.. ఆ రూల్ ఛేంజ్!

image

AP: ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విద్యార్థుల ఇళ్లకు 3kmsలోపు ఉన్న స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చారు. ఇకపై 3-5kms దూరంలో ఉన్న స్కూళ్లలోనూ కేటాయించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల తల్లులకు ఇప్పటికే ‘తల్లికి వందనం’ వచ్చి ఉంటే ఫీజులు వారే చెల్లించాలని తెలిపింది.