News August 5, 2025
HYD: విషాదం.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య

ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట రైల్వే బ్రిడ్జి కింద సోమవారం జగద్గిరిగట్టకు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జున్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
HYDలో భారీ వరద.. రంగంలోకి మేయర్

అతి భారీ వర్షానికి నగరంలోని బస్తీలు, కాలనీలతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున వరదనీరు నిలిచిపోయి రాకపోకలు స్తంభించడంతో నగర మేయర్ విజయలక్ష్మి రాత్రి అక్కడ పర్యటించారు. మోటార్ల సహాయంతో నీటిని తోడేయాలని, రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.
News September 15, 2025
దానం రాజీనామాకు ముందు జూబ్లీ ప్లాన్!

MLA దానం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రయత్నాలు ముమ్మరం చేశారు. AICC కీలక నేతతో టికెట్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో దానం నాగేందర్కు ప్రమాదం పొంచి ఉంది. ఆయన కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడంతో ఫిరాయింపు స్పష్టం కానుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో దానంను రాజీనామా చేయించాలని ఇటీవల CM, స్పీకర్, PCC చీఫ్ చర్చించారు. ఇక దానం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
News September 15, 2025
HYDలో విషాదం నింపిన వర్షం.. ముగ్గురి గల్లంతు

నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. హబీబ్నగర్లో మామ రామ, అల్లుడు అర్జున్ వరదల్లో కొట్టుకుపోయారు. మామను కాపాడబోయి అల్లుడు కూడా గల్లంతయ్యాడు. ఇక ముషీరాబాద్ వినోదనగర్లో యువకుడు సన్నీ నాలాలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, GHMC, HYDRA బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయి. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.