News March 31, 2024

హౌస్ అలవెన్స్ కోసం ఇతరుల పాన్‌కార్డ్ వాడేస్తున్నారు!

image

అద్దె ఇంట్లో ఉంటున్న వారు హౌస్ అలవెన్స్ కోసం రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు మోసానికి తెరతీసినట్లు ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరుల పాన్ కార్డుల్ని అనధికారికంగా వాడేస్తున్నారట. సదరు పాన్‌కార్డుదారుడికీ ఆ విషయం తెలీదు. ఇలా అద్దెకు లేకపోయినా రెంట్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్న 8-10వేల కేసులపై దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 6, 2024

హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ

image

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News October 6, 2024

తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు: సినీ రచయిత

image

డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టకుండా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారని సినీ రచయిత అబ్బూరి రవి ట్వీట్ చేశారు. ఇతర భాషా చిత్రాల గొప్పదనాన్ని, కళాత్మకతని తాను గౌరవిస్తానని తెలిపారు. తెలుగుని గౌరవించని వారి చిత్రాలను చూసేందుకు డబ్బులు ఖర్చుచేయడం గొప్పతనమని తాను అనుకోవట్లేదన్నారు. కాగా రజినీ ‘వేట్టయాన్’ మూవీ అదే పేరుతో తెలుగులో రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా మారింది.

News October 6, 2024

నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా 30వేల మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.