News August 5, 2025
భద్రాద్రిలో దారుణం.. యువకుడి సజీవ దహనం

భద్రాద్రి(D) గుండాల మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. వెన్నెలబైలుకు చెందిన పర్సిక రాజు (35) తన బైకుపై తన పొలం వద్దకు వెళ్తుండగా, బైక్కు హైటెన్షన్ విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. దీంతో బైకుకు మంటలు చెలరేగి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
Similar News
News August 6, 2025
క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44%కు పెంచాలి: తుమ్మల

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ను కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మల సీతారామన్ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ నెల ఆగస్టు కేటాయింపులతో కలిపి వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
News August 6, 2025
ATC కోర్సులతో ఉపాధి భరోసా: కలెక్టర్

యువతకు ATC కోర్సులతో ఉద్యోగాలకు భరోసా లభిస్తుందని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను అప్ గ్రేడ్ చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మారుతున్న కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నిష్ణాతులైన ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
News August 6, 2025
‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు’

జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి వ్యయం భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మండల నిర్మిత కేంద్రాలను తిరిగి ప్రారంభించింది. వీటి ద్వారా ఫ్లైయాష్ బ్రిక్స్ను సరసమైన ధరకే అందించనుంది. తద్వారా లబ్దిదారులకు ఆర్థిక భారం కాకుండా తోడ్పాటు నందించనుంది. కాగా ఇప్పటికే చింతకానిలో విఘ్నేశ్వర ఫ్లైయాష్ బ్రిక్ యూనిట్ కేంద్రం ప్రారంభమైంది.