News August 5, 2025
ఓటింగ్పై జీవీఎంసీ కార్పొరేటర్లకు అవగాహన

జీవీఎంసీలో బుధవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఓటింగ్ విధానంపై కార్పొరేటర్లకు GVMC అదనపు కమిషనర్ రమణమూర్తి మంగళవారం అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు ఓటర్ ఐడెంటిఫికేషన్ ఐడి కార్డును చూపించి లోపలకి వెళ్లాలన్నారు. ఒక ఓటరు 10ఓట్లు మాత్రమే వేయాలని, అంతకన్నా ఎక్కువ వేస్తే బ్యాలెట్ చెల్లదన్నారు.
Similar News
News August 6, 2025
అప్పికొండలో కొట్లాట.. ఐదుగురికి గాయాలు

పెదగంట్యాడ మండలం అప్పికొండ గ్రామంలోని స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారు ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో రౌడీ షీటర్ గరికిన గంగరాజు, అతని కుమారుడు కోటేశ్వరరావు, గంగరాజు అక్క బంగారమ్మ అతని భర్త కోటేశ్వరరావు గాయపడ్డారు. గాయపడ్డవారిని దువ్వాడ పోలీసులు హాస్పిటల్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
News August 6, 2025
విశాఖ: నేడే ఎన్నిక.. బరిలో 20 మంది

ఈరోజు ఉ.10 గంటలకు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు మొదలవ్వనున్నాయి. మొత్తం 97మంది <<17313160>>కార్పొరేటర్లు<<>> ఉండగా.. కూటమి తరుఫున 10 మంది, వైసీపీ తరఫున 10మంది పోటీలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది. జనసేనలో ఒకరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్నికకు తాను దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రకటించారు. మరో కార్పొరేటర్ బి.గంగారావు కూడా ఓటింగ్లో పాల్గొనరని సమాచారం.
News August 6, 2025
ఏయూ: క్వాంటం కంప్యూటింగ్పై ఎఫ్డిపి శిక్షణ

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్పై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను AU వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 తేదీ వరకు క్వాంటం కంప్యూటింగ్ ఇన్సైట్స్ ఫర్ అకడమీషన్స్-కాన్సెప్ట్, అప్లికేషన్స్ అండ్ టూల్స్ అనే అంశంపై ఎఫ్.డి.పి నిర్వహించనున్నారు.