News March 31, 2024
అకౌంట్లలో డబ్బులు జమ

AP: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికి నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల అకౌంట్లలో నగదు జమ చేసింది. దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 3, 2026
ఈనెల 29న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం?

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డి <<19338854>>వివాహ<<>> ముహూర్తం ఖరారైనట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 5న ఓ ఫామ్హౌస్లో కుటుంబీకులు, సెలబ్రిటీల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ఏప్రిల్ 29న తిరుమలలో వీరి వివాహం జరగనున్నట్లు చెప్పాయి. దీనిపై త్వరలోనే బెల్లంకొండ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
News April 3, 2026
ప్రసవం తర్వాత డిప్రెషన్లోకి తండ్రులు: అధ్యయనం

బిడ్డ పుట్టిన తర్వాత తండ్రులకూ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని JAMA నెట్వర్క్ ఓపెన్లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 30%మంది తండ్రులు ఈ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్రలేమి, పెరిగిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు. తండ్రి డిప్రెషన్లో ఉంటే అది తల్లి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 3, 2026
13న బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి?

TG: కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయమైందని సమాచారం. ఈ నెల 7న కేటీఆర్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. 13వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నాహాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.


