News August 5, 2025
BREAKING: బాచుపల్లిలో యాక్సిడెంట్.. స్టూడెంట్ మృతి

HYD బాచుపల్లి PS పరిధిలోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న మూసాపేట్ అంజయ్య నగర్కు చెందిన స్టూడెంట్ నిఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Similar News
News August 7, 2025
OU: ఎంఫార్మసీ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News August 6, 2025
ధూల్పేటలో కుస్తీ పోటీలు

లోవర్ ధూల్పేట్ మినీ స్టేడియంలో ఆగస్టు 9 నుంచి 12 వరకు శ్రీ లాలా పెహిల్వాన్–శ్రీ బాలాజీ పెహిల్వాన్ మెమోరియల్ రెస్లింగ్ టోర్నమెంట్ 2025-26 నిర్వహిస్తున్నారు. 17 వేర్వేరు వెయిట్ కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. లెజెండరీ కుస్తీ ఆటగాళ్ల వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ పోటీలు ప్రతియేటా కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయి టాప్ కుస్తీ వీరులు ఈ రింగులో పాల్గొంటారు. ప్రవేశం ఉచితం.
News August 6, 2025
HYD: భారం నీదే వి‘నాయక’!

‘ఇంకా 20 రోజులే ఉంది.. ఏం చేద్దాం బ్రో?’ అని బస్తీలో చర్చ మొదలైంది. సిటీలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా! ఆ మాత్రం హడావిడి ఉంటది. ఈసారి వినాయకచవితికి హైదరాబాదీ ఆరాటం అంతా ఇంతా కాదు. ‘ఖైరతాబాద్లో మహాగణపతి కొలువుదీరుతుండు. బాలాపూర్ విగ్రహం, మండపం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఇక గల్లీలో మనం తగ్గొద్దు. కర్రపూజకు నాయకులను పిలుద్దాం. ఖర్చు ఎంతైనా వి‘నాయకుడి’ మీదే భారం అంటూ యువత నవరాత్రులకు సిద్ధమవుతోంది.