News August 6, 2025

ప్లాట్ల క్రమబద్ధీకరణకు గడువు పొడగింపు: కలెక్టర్

image

అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం జీవో నంబర్ 134 ద్వారా అవకాశం కల్పించిందని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. అనధికార లేఅవుట్లలో జూన్ 30, 2025 నాటికి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు సులభతరంగా స్వీయ ధ్రువీకరణ అంగీకార పత్రం సమర్పించి భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉందన్నారు.

Similar News

News August 6, 2025

రాజమండ్రి: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి. ప్రశాంతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజమండ్రిలో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆమె తెలిపారు. 2026 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను అనుసరించి, వారికి సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News August 6, 2025

తూ. గో జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

image

అసాంఘిక కార్యకలాపాలను అణిచివేసేందుకు మంగళవారం తూ.గో జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జోనల్ డీఎస్పీలు, సిబ్బంది టీములుగా ఏర్పడి తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటు సారా, నంబర్, రికార్డులు లేని 193 ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నరసింహకిశోర్ హెచ్చరించారు.

News August 5, 2025

బంగారు కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తన కార్యాలయంలో మాట్లాడారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.