News August 6, 2025
ఆక్వా జోన్ సర్వేలో నిబంధనలు పాటించాలి: ఇన్ఛార్జ్ కలెక్టర్

ఆక్వా జోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ అన్నారు. భీమవరం జేసి ఛాంబర్లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండల లెవెల్ కమిటీ అధికారులు అందరూ ఆక్వా జోన్లో ప్రతిపాదించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News September 1, 2025
ఆకివీడులో పెన్షన్ పంపిణీ చేసిన జేసీ

ఆకివీడు (M) దుంపగడపలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఆయనే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. సిబ్బంది పెన్షన్ సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు సక్రమంగా అందజేయకపోవడం, లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 1, 2025
గణపవరం మండలం ప.గోలోనే కొనసాగుతుంది: కేంద్రమంత్రి హామీ

ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.
News September 1, 2025
గణపవరం మండలం ప.గోలోనే కొనసాగుతుంది: కేంద్రమంత్రి హామీ

ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.