News March 31, 2024

విశాఖలో కొరియర్ పేరుతో రూ.20 లక్షలు కొట్టేశారు

image

ఫెడెక్స్ కొరియర్ పేరుతో నగరానికి చెందిన వ్యక్తికి రూ.20 లక్షలకు టోకరా వేసిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముంబై నుంచి తైవాన్‌కు చేసిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఒక వ్యక్తికి నేరగాళ్లు ఫోన్ చేశారు. తాను కొరియర్ చేయలేదంటూ చెప్పగా.. సదరు వ్యక్తి అడ్రస్, ఇతర వివరాలు కరెక్ట్‌గా చెప్పడంతో భయపడ్డాడు. బ్యాంక్ ఖాతా తనిఖీ చేయాలని చెప్పి రూ.20 లక్షలు కాజేశారు.

Similar News

News October 4, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైఎస్ షర్మిల కీలక ప్రకటన

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో సీఎంను కలుస్తామన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు.
.

News October 4, 2024

విశాఖలో రెండో రోజు టెట్ పరీక్షకు 1662 మంది హాజరు

image

జిల్లాలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు రెండో రోజు శుక్రవారం 1662 మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో రోజు 1852 మంది విద్యార్థుల పరీక్ష రాయాల్సి ఉందన్నారు. తాను ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిందని వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవి వెల్లడించారు.

News October 4, 2024

మిస్సెస్ ఇండియా-2024గా విశాఖ మహిళ

image

మలేషియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిస్సెస్ ఇండియా-2024 విజేతగా విశాఖకు చెందిన హేమలతా రెడ్డి నిలిచారు. 300 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతగా నిలిచి విశాఖ ఖ్యాతిని పెంచారు. ఆమె ఇంతకముందు యాంకర్‌గా పనిచేశారు. త్వరలో పారిస్ ఫ్యాషన్ వీక్‌కి కూడా వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హేమలతా రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, పలువురు పాత్రికేయులు సత్కరించారు.