News August 6, 2025
ఏయూ: క్వాంటం కంప్యూటింగ్పై ఎఫ్డిపి శిక్షణ

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్పై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను AU వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 తేదీ వరకు క్వాంటం కంప్యూటింగ్ ఇన్సైట్స్ ఫర్ అకడమీషన్స్-కాన్సెప్ట్, అప్లికేషన్స్ అండ్ టూల్స్ అనే అంశంపై ఎఫ్.డి.పి నిర్వహించనున్నారు.
Similar News
News August 7, 2025
విశాఖలో నిపర్, CGHS కేంద్రాల కోసం ఎంపీ శ్రీభరత్ వినతిపత్రం

విశాఖలో ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధికి నిపర్ ఏర్పాటు అవసరమని కోరుతూ ఎంపీ శ్రీభరత్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ఢిల్లీలో కలిశారు. విద్యా-పరిశ్రమల అనుసంధానం, పరిశోధన, ఉద్యోగావకాశాలకు ఇది దోహదపడుతుందని వివరించారు. అలాగే కేంద్ర ఉద్యోగుల కోసం రెండు CGHS వెల్నెస్ సెంటర్లు, డైరెక్టరేట్ కార్యాలయాల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.
News August 7, 2025
విశాఖ: లూజ్లో పెట్రోల్ అమ్మకాలు

విశాఖలోని పలు పెట్రోల్ బంకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. డైరీ ఫారం సమీపంలోని ఓ బంక్లో లూజు పెట్రోల్ అమ్ముతున్నారు. దీంతో కల్తీ పెట్రోల్ అమ్మకాలతో పాటు నేరాల చేసేందుకు ఆస్కారం ఉంది. అధికారులు స్పందించి లూజ్ విక్రయాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
News August 7, 2025
బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించాం: విశాఖ ఎంపీ

కేంద్ర మంత్రి వీరేందర్ కుమార్ను ఎంపీ శ్రీభరత్ బుధవారం కలిసి డిసెబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గంభీరం భూమి అనువుకాదని, కొత్తగా బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించామని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర అధికారులు పరిశీలించి ఆమోదించారని, త్వరితంగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ హబ్ దివ్యాంగ అథ్లెట్లకు శిక్షణా కేంద్రంగా మారుతుందని తెలిపారు.