News August 6, 2025

జడ్చర్ల: వాగులో జారి పడి మహిళా గల్లంతు

image

వాగులో జారిపడి మహిళా గల్లంతైన ఘటన జడ్చర్ల మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన జ్యోతి (35) పొలం పనులకు వెళ్తుండగా వాగులో జారి పడి గల్లంతు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News August 7, 2025

MBNR: సైబర్ క్రైమ్.. అప్రమత్తంగా ఉండండి

image

ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీస్ సిబ్బంది అవగాహన కల్పించిన పలువురు మోసపోతూనే ఉన్నారు. అనుమానాస్పద లింకులు, వీడియో కాల్స్, డబ్బు వస్తుందన్న ఆశతో క్లిక్ చేయడం వల్ల వచ్చే మోసాలపై హెచ్చరికలు చేస్తున్నారు. మోసపోయినట్టయితే వెంటనే 1930కు కాల్ చెయ్యాలని, www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలన్నారు. సైబర్ కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News August 6, 2025

జడ్చర్ల: గల్లంతైన మహిళా మృతదేహం లభ్యం

image

జడ్చర్ల మండలం నెక్కొండలో బుధవారం ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడి ఓ మహిళా గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు ప్రకారం.. నెక్కొండ గ్రామానికి చెందిన జ్యోతి (34) వ్యవసాయ పనులకు వెళ్తుండగా కాలు జారి గల్లంతయింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని జ్యోతి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి నలుగురు కుమారులు, భర్త ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News August 6, 2025

MBNR: సర్కార్ పేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా గండీడ్ మండలం సర్కార్ పేటలో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహమ్మదాబాద్ 9.5, చిన్నచింతకుంట 11.0, సీసీ కుంట మండలం వడ్డేమాన్ లో 7.3, కౌకుంట్ల 3.8, జడ్చర్ల 3.5, రాజాపూర్ 1.3, మహబూబ్ నగర్ అర్బన్, బాలానగర్ 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.