News March 31, 2024
గద్వాల: పోస్టల్ దరఖాస్తుకు ఏప్రిల్ 23 వరకు గడువు

ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్న అధికారులు, పోలింగ్ రోజున ఓటు వేసే అవకాశం లేని కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్లు, ఇంటి వద్దనే ఓటు వేయడానికి ఏప్రిల్ 23లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆర్డీవో రామచందర్, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు ఉన్నారు.
Similar News
News March 14, 2026
MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
News March 13, 2026
MBNR: పదో తరగతి పరీక్షలు.. జిల్లా విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం చేశారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఏవైనా సందేహాలున్నా, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ను 83747 72282ను సంప్రదించాలని డీఈవో ప్రవీణ్ కుమార్ సూచించారు.
News March 13, 2026
MBNR: ఈనెల 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీ తరగతులు

మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ II, IV, VI తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న విద్యార్థులనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 73829 29609 నంబరును సంప్రదించాలని కోరారు.


