News August 6, 2025

ధూల్‌పేటలో కుస్తీ పోటీలు

image

లోవర్ ధూల్‌పేట్ మినీ స్టేడియంలో ఆగస్టు 9 నుంచి 12 వరకు శ్రీ లాలా పెహిల్వాన్–శ్రీ బాలాజీ పెహిల్వాన్ మెమోరియల్ రెస్లింగ్ టోర్నమెంట్ 2025-26 నిర్వహిస్తున్నారు. 17 వేర్వేరు వెయిట్ కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. లెజెండరీ కుస్తీ ఆటగాళ్ల వారసత్వాన్ని గౌరవిస్తూ ఈ పోటీలు ప్రతియేటా కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయి టాప్ కుస్తీ వీరులు ఈ రింగులో పాల్గొంటారు. ప్రవేశం ఉచితం.

Similar News

News August 9, 2025

HYD: తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

image

తమ్ముడి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచిన అక్క కథ ఇది. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలుడు అప్లాస్టిక్‌ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ KIMSలో అడ్మిట్ అయ్యాడు. మూల కణాల (Stem cells) మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పడంతో తన శరీరం నుంచి దానం చేసిన అక్క తమ్ముడికి పునర్జన్మ‌ను ప్రసాదించింది. ఆస్పత్రిలో ఉన్న తమ్ముడికి నేడు రాఖీ కట్టింది. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష’ అన్న నానుడికి ఈ సోదరి నిదర్శనం.

News August 9, 2025

జూబ్లీహిల్స్‌లో కుల రాజకీయం

image

జూబ్లీహిల్స్ బై‌పోల్ ముంగిట రాజకీయం ‘కుల’ రంగు పులుముకుంటోంది. కమ్మ కులానికి BRS అన్యాయం చేస్తోందన్న విమర్శలను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. CMకు ప్రేమ ఉంటే కమ్మ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. BRS కూడా ఆ సామాజికవర్గానికి చెందిన నేతనే నిలబెడుతుందని తేల్చిచెప్పారు. అయితే, సెగ్మెంట్‌లో కమ్మ ఓట్లు 50 వేలు ఉన్నాయని, పార్టీ ఏదైనా తమకే టికెట్ ఇవ్వాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక పట్టుబట్టడం గమనార్హం.

News August 9, 2025

నిజాంపేటలో వల్లి సిల్క్స్ ప్రారంభం

image

హైదరాబాద్‌లో సిల్క్ వస్త్రాలకు పేరుగాంచిన వల్లి సిల్క్స్ నూతన బ్రాంచ్‌ను నిజాంపేటలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువలో నాణ్యమైన సిల్క్ వస్త్రాలను అందించే లక్ష్యంతో ఈ బ్రాంచ్ ప్రారంభించినట్లు వల్లి సిల్క్స్ యాజమాన్యం ప్రకటించింది. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాఖీ సందర్భంగా రూ.99 కే చీర అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలంది.