News August 7, 2025

బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించాం: విశాఖ ఎంపీ

image

కేంద్ర మంత్రి వీరేందర్ కుమార్‌ను ఎంపీ శ్రీభరత్ బుధవారం కలిసి డిసెబిలిటీ స్పోర్ట్స్ సెంటర్‌ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గంభీరం భూమి అనువుకాదని, కొత్తగా బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించామని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర అధికారులు పరిశీలించి ఆమోదించారని, త్వరితంగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ హబ్ దివ్యాంగ అథ్లెట్లకు శిక్షణా కేంద్రంగా మారుతుందని తెలిపారు.

Similar News

News August 12, 2025

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం

image

విశాఖ జూ పార్క్‌లో క్యూరేటర్ మంగమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇందిరాగాంధీ జూ పార్క్‌లో ప్రస్తుతం కృష్ణ, రాజు, సరస్వతి, లక్ష్మీ అనే నాలుగు ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయని జూపార్క్ సిబ్బంది వివరించారు.

News August 12, 2025

మృతుని వివరాలు తెలిస్తే చెప్పిండి: ఆరిలోవ ఎస్ఐ

image

ఆదివారం అర్ధరాత్రి ఓల్డ్ డైరీ ఫార్మ్ సమీపంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న వ్యాను ఢీకొని సుమారు 40 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇప్పటివరకు మృతుని వివరాలు తెలియలేదు. వ్యక్తి వివరాలు గుర్తుపట్టిన వారు వెంటనే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ వై.కృష్ణ సూచించారు. ప్రస్తుతం మృతదేహం మార్చురీలో భద్రపరిచారు.

News August 12, 2025

విశాఖ జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్

image

విశాఖలో మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డిఎంహెచ్ఓ జగదీశ్వర రావు పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్ ఇవ్వనున్నారు.