News August 7, 2025
NZB: భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

NZB జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు నదులు, వాగుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని హితవు పలికారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాల్వలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు.
Similar News
News September 10, 2025
NZB: వాగులో గుర్తు తెలియని మృతదేహం

నిజామాబాద్ బోర్గాం వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వారు 4వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 35-40 ఉంటుందని పోలీసులు చెప్పారు. కాగా మృతుడు ఆత్మహత్య చేసుకొన్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 10, 2025
NZB జిల్లా నుంచి ఇద్దరు నేతలు BJP రాష్ట్ర కార్యవర్గంలోకి

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జిల్లా నుంచి ఇద్దరు నాయకులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ జీ.స్రవంతి రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్యను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు.
News September 10, 2025
NZB: సబ్ జూనియర్ బాస్కెట్బాల్ సెలక్షన్స్ నేడు

నిజామాబాద్ జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ మైదానంలో ఇవాళ ఉదయం 11:30కు సబ్ జూనియర్స్ బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు బాస్కెట్బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు. ఈ సెలక్షన్స్లో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాల కోసం ఆర్గనైజింగ్ కార్యదర్శి నిఖిల్ను సంప్రదించవచ్చని సూచించారు.