News August 7, 2025
విశాఖలో ఏపీఎల్.. ప్రవేశాలు ఉచితం

విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు విశాఖ ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ లీగ్లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. బ్రాండ్ అంబాసిడర్గా హీరో వెంకటేశ్ వ్యవహించనున్నారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీచరణ్ పాకాల లాంటి వారు పాల్గొననున్నారు. అన్ని మ్యాచులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఏసీఏ ప్రతినిధులు ప్రకటించారు.
Similar News
News August 11, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓రేపు కలెక్టరేట్లో ప్రజావాణి.. ఐటీడీఏలో గిరిజన దర్బార్
✓జిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం బోనాలు
✓టేకులపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఎస్పీ
✓బూర్గంపాడు: చింతకుంటలో తాగునీటి సమస్య
✓ఆళ్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి
✓భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత
✓బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద్వ వైఖరి: సీపీఎం
✓ఇల్లందు: చల్ల సముద్రంలో యూరియా కొరత
News August 10, 2025
MBNR: పరిశుభ్రమైన ఆహారం అందించకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని తిరుమలగిరిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆదివారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహంలో సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
News August 10, 2025
సిద్దిపేటలో ఆకస్మికంగా తనిఖీలు

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణాను అరికట్టడానికి వాహన తనిఖీ చేపట్టినట్లు సీపీ డాక్టర్ అనురాధ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కింద 76, ఎంవీ యాక్ట్ కింద 425 కేసులు నమోదైనట్లు తెలిపారు.