News August 7, 2025
ఈ ‘స్వామి’ ఆకలి కేకలను దూరం చేశాడు

భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారారు. జపాన్, US, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై ఆయన చేసిన పరిశోధనలు ఆకలి కేకలను దూరం చేశాయి. ఆ తర్వాత భారత్ వెనుతిరిగి చూడలేదు. విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
Similar News
News August 11, 2025
శుభ సమయం (11-08-2025) సోమవారం

✒ తిథి: బహుళ విదియ మ.11.42 వరకు
✒ నక్షత్రం: శతభిషం మ.2.58 వరకు
✒ శుభ సమయం: ఉ.6.40-7.16, రా.7.52-8.16
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: మ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34
✒ వర్జ్యం: రా.9.13-రా.10.46
✒ అమృత ఘడియలు: ఉ.7.56-ఉ.9.29
News August 11, 2025
నేటి ముఖ్యాంశాలు

* బెంగళూరులో 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ
* TG: హైదరాబాద్ బస్తీల్లో పర్యటించిన సీఎం రేవంత్
* అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి
* తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్
* AP: డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్ కళ్యాణ్
* చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్
* రేపు పీఎం ఫసల్ బీమా యోజన నిధులు విడుదల
News August 11, 2025
భారత డ్యామ్ను మిస్సైళ్లతో పేల్చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

US గడ్డపై నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్కు హెచ్చరికలు చేశారు. ‘భవిష్యత్తులో తమ దేశానికి భారత్తో ముప్పు ఉందని తెలిస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు ధ్వంసం చేస్తాం. సింధూ నదిపై భారత్ డ్యామ్ కట్టే వరకు ఆగి 10 మిస్సైళ్లతో పేల్చేస్తాం. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. మాదీ అణ్వాయుధ దేశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా వద్ద మిస్సైళ్లకు కొదవ లేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.