News August 7, 2025

JNTU: ఆగస్టు 11 నుంచి తరగతులు

image

వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులకు JNTUH అధికారులు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. 2025-26 విద్యా సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులకు తరగతులు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. 11వ తేదీ నుంచి (సోమవారం) నుంచి రెగ్యులర్‌గా తరగతులు జరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు వర్సిటీలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇక కాలేజీకి వెళ్లేందుకు సిద్ధం కండి మరి.

Similar News

News August 31, 2025

మోమిన్‌పేటలో భర్తను చంపేసిన భార్య

image

మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 31, 2025

జూబ్లీహిల్స్‌‌లో గెలిపిస్తే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు: KA పాల్‌

image

రానున్న ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏడాదిలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలను ఇప్పిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ తెలియజేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశం అల్లకల్లోలం అవుతోందన్నారు.

News August 31, 2025

HYD: చిట్టి గణపయ్యకు చిన్న జీపు

image

వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నగరంలో నిమజ్జనాల ఊరేగింపులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మాదన్నపేటలో ఓ చిన్నారి చిట్టి గణపయ్య కోసం చిన్న జీపును సిద్ధం చేసింది. గణపయ్యను ఆ వాహనం మీద ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.