News August 7, 2025

విశాఖలో నిపర్, CGHS కేంద్రాల కోసం ఎంపీ శ్రీభరత్ వినతిపత్రం

image

విశాఖలో ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధికి నిపర్ ఏర్పాటు అవసరమని కోరుతూ ఎంపీ శ్రీభరత్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ఢిల్లీలో కలిశారు. విద్యా-పరిశ్రమల అనుసంధానం, పరిశోధన, ఉద్యోగావకాశాలకు ఇది దోహదపడుతుందని వివరించారు. అలాగే కేంద్ర ఉద్యోగుల కోసం రెండు CGHS వెల్నెస్ సెంటర్లు, డైరెక్టరేట్ కార్యాలయాల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News August 12, 2025

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం

image

విశాఖ జూ పార్క్‌లో క్యూరేటర్ మంగమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇందిరాగాంధీ జూ పార్క్‌లో ప్రస్తుతం కృష్ణ, రాజు, సరస్వతి, లక్ష్మీ అనే నాలుగు ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయని జూపార్క్ సిబ్బంది వివరించారు.

News August 12, 2025

మృతుని వివరాలు తెలిస్తే చెప్పిండి: ఆరిలోవ ఎస్ఐ

image

ఆదివారం అర్ధరాత్రి ఓల్డ్ డైరీ ఫార్మ్ సమీపంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న వ్యాను ఢీకొని సుమారు 40 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇప్పటివరకు మృతుని వివరాలు తెలియలేదు. వ్యక్తి వివరాలు గుర్తుపట్టిన వారు వెంటనే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ వై.కృష్ణ సూచించారు. ప్రస్తుతం మృతదేహం మార్చురీలో భద్రపరిచారు.

News August 12, 2025

విశాఖ జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్

image

విశాఖలో మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డిఎంహెచ్ఓ జగదీశ్వర రావు పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్ ఇవ్వనున్నారు.