News August 7, 2025

బోథ్: CM రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్యకు పదవి ఇప్పించినందుకు గాను సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు, తాజా రాజకీయాలను సీఎంతో చర్చించినట్లు గజేందర్ పేర్కొన్నారు.

Similar News

News August 7, 2025

తలమడుగు: ఇంటి నుంచి వెళ్లి శవమై తేలాడు

image

తలమడుగు మండలంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి శవమై కనిపించాడు. SI రాధిక వివరాల ప్రకారం.. మండలం సుంకిడి కి చెందిన దాసరి ప్రశాంత్ ఇంట వారసత్వ భూమి విషయంలో ప్రతిరోజు మద్యం మత్తులో తండ్రి ఎర్రన్నతో గోడవపడేవాడు. ఈ నెల 6న మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం సుంకిడి వాగులో శవమై కనిపించగా తండ్రి ఎర్రన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News August 6, 2025

ఆదిలాబాద్: కృష్ణ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు సూచన

image

విజయవాడ డివిజన్లో లైబీ బ్లాక్ కారణంగా ADB నుంచి తిరుపతి వరకు నడిచే కృష్ణ ఎక్స్ ప్రెస్‌ను కొద్దీ రోజులు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 17406 ADB నుంచి తిరుపతి నడిచే రైలు ఈనెల 8,10,12 తేదీలలో రెండు గంటలు ఆలస్యంగా ఉంటుందన్నారు. రైలు నంబర్ 17405 తిరుపతి నుంచి ADB నడిచే రైలు ఈనెల 13 నుంచి 19 వరకు రద్దు, 17406 ADB నుంచి తిరుపతి ఈనెల 14 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నామన్నారు.

News August 6, 2025

ఆదిలాబాద్: ‘ఆకతాయిల వేధిస్తే షీ టీంను సంప్రదించండి’

image

ఆకతాయిల వేధింపులకు గురైతే వెంటనే షీ టీం నంబర్ 8712659953కు సంప్రదించాలని షీ టీం ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ సుశీల సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో విద్యార్థులకు షీ టీం సేవలపై ఆమె అవగాహన కల్పించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది వాణిశ్రీ, మహేష్, మోహన్ పాల్గొన్నారు.