News March 31, 2024
పాలమూరులో ‘పాగా’ వేసేది ఎవరో..?

మహబూబ్నగర్ లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీల నేతలు నువ్వా.. నేనా.. అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. BRS నుంచి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, BJP పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈసారి కూడా గెలుపు మాదే అని BRS, తామే గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ ధీమాలో ఉన్నాయి. మరి ఇక్కడ ‘పాగా’ వేసేది ఎవరో..? చూడాలి. దీనిపై మీ కామెంట్ ?
Similar News
News March 18, 2026
MBNR: ‘తొలిసారిగా డిజిటల్లో జనాభా గణన’

జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2021లో నిర్వహించవలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యం అయిందన్నారు.
News March 18, 2026
MBNR: జన గణన.. దశలవారీగా ఇలా!

✒మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్లిస్టింగ్,హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన, తెలంగాణ రాష్ట్రంలో ఈ దశ మే 11, 2026న ప్రారంభమై జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని,
✒రెండవ దశలో జన గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహించబడుతుందని,మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జనగణనను విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
News March 17, 2026
పాలమూరు: రైతులు ALERT.. అప్లై చేసుకోండి

‘రైతు భరోసా’ కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం రైతులు ఈనెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆధార్, పట్టాదార్ పాస్ బుక్ (28/02/2026 వరకు వచ్చిన కొత్త పట్టా), బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నంబర్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT


