News August 8, 2025
AP న్యూస్ రౌండప్

☛ విజయవాడలో పారిశ్రామిక వేత్తలతో P4 కార్యక్రమంపై చర్చించిన CM చంద్రబాబు.. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వంతో కలిసి రావాలని పిలుపు
☛ సెలూన్లకు ఉచిత విద్యుత్ పరిమితి 150 నుంచి 200 యూనిట్లకు పెంపు
☛ ఈనెల 9న అల్లూరి జిల్లా పాడేరుకు CM చంద్రబాబు
☛ రెవెన్యూ భూముల ఆరోపణలపై విచారణ జరిపించాలని CM చంద్రబాబుకు బొత్స లేఖ
Similar News
News August 8, 2025
అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి: చంద్రబాబు

AP: చేనేత సూరీడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్మించే పార్కుకు ఆయన పేరు పెట్టి, అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రూ.74 కోట్లతో వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, రాజాం, శ్రీకాళహస్తిలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసి, చేనేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చేనేతల అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లను సలహాదారుగా నియమించామన్నారు.
News August 8, 2025
భారత్, రష్యా, చైనా కలుస్తాయా?

US టారిఫ్స్కు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా ఏకమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. రష్యా, బ్రెజిల్ అధ్యక్షులు పుతిన్, లులా భారత్కు రానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఆరేళ్ల తర్వాత చైనాకు వెళ్లనున్నారు. అటు ఇండియాలోని చైనా రాయబారి అమెరికా సుంకాలపై విమర్శలు గుప్పించారు. WTO నియమాలను యూఎస్ ఉల్లంఘిస్తోందన్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే USపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
News August 8, 2025
అప్డేటెడ్ ఆధార్ ఉంటేనే ఉచిత ప్రయాణం: అధికారులు

TG: RTC బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఫొటోతో పాటు తెలంగాణ చిరునామా కార్డుపై అప్డేట్ అయి ఉండాలని పేర్కొన్నారు. ఇటీవల నిర్మల్(D) భైంసా నుంచి NZB వెళ్తున్న బస్సులో కొందరు మహిళలు ఉమ్మడి AP ఆధార్ కార్డు చూపించగా జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. దీంతో మహిళలు <<17319477>>ఆగ్రహించిన<<>> సంగతి తెలిసిందే.