News March 31, 2024
జిల్లా ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

కలెక్టర్ పి రాజాబాబు జిల్లా ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు పునరుద్ధానం పొందిన పర్వదినం ఈస్టర్ అన్నారు. అటువంటి పర్వదినం జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
Similar News
News September 29, 2025
‘మీ సమస్య ఏదైనా ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మచిలీపట్నంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 38 ఫిర్యాదులు స్వీకరించారు. SP విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో అడిషనల్ SP V.V నాయుడు ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుడివాడకు చెందిన వనజ కుటుంబ వేధింపులు, అవనిగడ్డకు చెందిన కిషోర్ ఉద్యోగ మోసం, తోట్లవల్లూరుకు చెందిన వృద్ధుడు నరసయ్య ఆస్తి కోసం తన కుమారులు వేధింపులు, తదితర ఫిర్యాదులు అందాయన్నారు.
News September 28, 2025
హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచి కేసుల పరిష్కారంలో జాప్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట గస్తీని పెంచాలన్నారు.
News September 27, 2025
మచిలీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లు పంపిణీ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్లో పని చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా శానిటేషన్ కిట్లు అందజేశారు. పరిసరాలను శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు.