News August 8, 2025

ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 75,000 భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 49,000 సాదా బైనామా దరఖాస్తులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, ర్యాండమ్ చెకింగ్ ద్వారా తప్పులు నివారించాలని సూచించారు. సెలవులు లేకుండా రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు.

Similar News

News August 13, 2025

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం విద్యా శాఖ సమావేశాన్ని నిర్వహించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా టీచర్లు, విద్యార్థుల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 3రోజుల్లో ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలని, అధిక విద్యార్థులున్న 237పాఠశాలల్లో టీచర్ కొరత రాకుండా చూడాలని సూచించారు. యూడీఐఎస్‌సీ పోర్టల్‌ను 15రోజుల్లో అప్‌డేట్ చేయాలని, ప్రతి నెల బ్యాగ్‌లెస్ డే నిర్వహించాలన్నారు.

News August 12, 2025

లాభాల్లో దూసుకెళ్తున్న మహిళా మార్ట్

image

ఖమ్మం నగరంలోని మహిళామార్ట్ లాభాల్లో దూసుకెళ్తుంది. ఈ ఏడాది మే 28న మార్ట్ మొదలు కాగా రెండు నెలల్లోనే వ్యాపారం రూ.17 లక్షలు దాటింది. ఈ తరహా మార్ట్ రాష్ట్రంలో ఇదే మొదటిది. దీనిని గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రూ.30 లక్షల సెర్ప్ నిధులతో నిర్మించారు. మార్ట్ జిల్లాలో SHG సభ్యులకు ఊతంగా మారింది. అలాగే ప్రస్తుతం వందలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తుంది.

News August 12, 2025

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆప్డేట్

image

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు గంపెడాశలతో ఉన్నారు. ఐదు నియోజకవర్గాలకు మొదటి విడతలో ప్రభుత్వం 16,153 ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు 12, 173 ఇళ్లకు ముగ్గుపోశారు. 6,630 బేస్‌మెంట్, 664 గోడలు, 418పై కప్పు పూర్తైయ్యాయి. 90 శాతం మందికి రూ. 61 కోట్లు వారి ఖాతాల్లో జమైనట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.