News August 8, 2025
సచివాలయ ఉద్యోగిపై చీటింగ్ కేసు నమోదు

సచివాలయ ఉద్యోగి సంజీవ్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పుంగనూరు SI వెంకటరమణ తెలిపారు. కొండందొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతుకు రామకుప్పం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంజీవ్ ట్రాక్టర్ ఇప్పిస్తానంటూ రూ.4.60 లక్షలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ ఇప్పించమని అడగగా ఆయన ముఖం చాటేయడంతో మోసిపోయానని గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
Similar News
News August 9, 2025
నెలాఖరున కుప్పం రానున్న సీఎం?

సీఎం చంద్రబాబు ఈ నెలాఖరున కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సమాచారం. హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల చేసేందుకు సీఎం 29 లేదా 30 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆగస్టు నెలాఖరికల్లా కుప్పానికి హంద్రీనీవా నీళ్లు విడుదల చేస్తామని ఇది వరకే సీఎం పేర్కొన్న నేపథ్యంలో హంద్రీనీవా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News August 9, 2025
చిత్తూరు: పోలింగ్ అధికారుల వేతనాలు పెంపు

చిత్తూరు జిల్లాలో పోలింగ్ అధికారులు, సిబ్బంది వేతనాలు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, కౌంటింగ్, సీపీఎస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, డిప్యూటీ డీఈవో, సెక్టార్ అధికారుల వేతనాలు పెంచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారులకు రూ.350 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్లకు రూ.250 నుంచి రూ.400, కౌంటింగ్ అసిస్టెంట్లకు రూ.450కు పెంచారు.
News August 9, 2025
చిత్తూరు జిల్లాలో నేడు పవర్ కట్

మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిత్తూరు నగరం, చిత్తూరు రూరల్స్, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.