News August 8, 2025

సుంకాల నుంచి ఫార్మాకు మినహాయింపు.. ఎందుకంటే?

image

అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్లలో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు మన దేశ మందులనే వాడుతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని భారత ఫార్మా కంపెనీలు USలోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

Similar News

News August 8, 2025

పార్టీ అభివృద్ధికి మోదీ సూచనలు ఇచ్చారు: మాధవ్

image

AP: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. ‘రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని సలహాలు, సూచనలు ఇచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని మోదీ బదులిచ్చారు. హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహిస్తాం’ అని వెల్లడించారు.

News August 8, 2025

BREAKING: కాంతార మూవీ నటుడు మృతి

image

‘కాంతార’ చిత్రంలో నటించిన టి.ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడ్కాలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు. ఐదేళ్ల క్రితం ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తొలుత నాటక రంగంలో ఉన్న ఆయన క్రమంగా సినిమాల్లోకి వచ్చారు.

News August 8, 2025

లంచ్ తర్వాత ఈ పనులు చేస్తున్నారా?

image

కొందరు మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘లంచ్ చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అలాగే కూల్ వాటర్, జ్యూసులు కూడా తీసుకోకూడదు. వాకింగ్ చేయకూడదు. ముఖ్యంగా లంచ్ తర్వాత సిగరెట్ తాగడం ప్రమాదకరం’ అని చెబుతున్నారు.