News August 8, 2025
చౌడేపల్లి: ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్

చౌడేపల్లి మండలంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తలి మండలి నియామకానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 27 లోపు దేవస్థాన కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 7న నోటిఫికేషన్ జారీ చేశారని దరఖాస్తుకు 20 రోజుల గడువు విధించారని ఆయన చెప్పారు.
Similar News
News August 9, 2025
నెలాఖరున కుప్పం రానున్న సీఎం?

సీఎం చంద్రబాబు ఈ నెలాఖరున కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సమాచారం. హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల చేసేందుకు సీఎం 29 లేదా 30 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆగస్టు నెలాఖరికల్లా కుప్పానికి హంద్రీనీవా నీళ్లు విడుదల చేస్తామని ఇది వరకే సీఎం పేర్కొన్న నేపథ్యంలో హంద్రీనీవా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News August 9, 2025
చిత్తూరు: పోలింగ్ అధికారుల వేతనాలు పెంపు

చిత్తూరు జిల్లాలో పోలింగ్ అధికారులు, సిబ్బంది వేతనాలు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, కౌంటింగ్, సీపీఎస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, డిప్యూటీ డీఈవో, సెక్టార్ అధికారుల వేతనాలు పెంచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారులకు రూ.350 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్లకు రూ.250 నుంచి రూ.400, కౌంటింగ్ అసిస్టెంట్లకు రూ.450కు పెంచారు.
News August 9, 2025
చిత్తూరు జిల్లాలో నేడు పవర్ కట్

మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిత్తూరు నగరం, చిత్తూరు రూరల్స్, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.