News March 31, 2024
శ్రీకాకుళం: ప్రధాన కూడళ్లు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు

శ్రీకాకుళం పట్టణంతోపాటు మండల కేంద్రాలు ప్రధాన కూడళ్ళు వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిలాని సమూన్ శనివారం అధికారులకు సూచించారు. వేసవి ఎండలు తీవ్రత పెరుగుతున్నందున చలివేంద్రాలు ఏర్పాటు తప్పనిసరి అని అన్నారు. మున్సిపాలిటీ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు చలివేంద్రాలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News March 14, 2026
సిక్కోలు దొర..సేవలు మరువలేం

మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సిక్కోలు జిల్లాకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన హనుమంతు జగన్నాథ దొర మన ప్రాంత వాసి కావడం గర్వకారణం.1943లో కోటబొమ్మాళి(M) జర్జంగిలో జన్మించిన హెచ్. జె.దొర పోలీసు శాఖలో 40 ఏళ్లుగా పని చేశారు. స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణమండపం, శివాలయాన్ని నిర్మించారు. సొంత ఇంటిని వృత్తి విద్యా శిక్షణా కేంద్రంగా మార్చి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.
News March 14, 2026
గారలో బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన జపనీస్

గార మండలం సాలిహుండం బౌద్ధక్షేత్రాన్ని జపాన్ దేశానికి చెందిన బృందం నేడు సందర్శించారు. ప్రాచీన బౌద్ధ స్మారకాలు, స్థూపాల అవశేషాలను ఆసక్తిగా పరిశీలించి వాటి చారిత్రక ప్రాముఖ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్శనతో సాలిహుండం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులంటున్నారు. ప్రజలు, ప్రతినిధులను వీరిని ఆత్మీయంగా ఆహ్వానించారు.
News March 14, 2026
శ్రీకాకుళం: ఫోటోల అశ్లీల మార్ఫింగ్ చేసిన విద్యార్థిపై కేసు

శ్రీకాకుళం రూరల్ పరిధి మునసబుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థినిల ఫోటోల అశ్లీల మార్ఫింగ్ అంశంలో అసలెంత మంది పాత్ర ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనల నేపథ్యంలో ప్రిన్సిపల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.


