News March 31, 2024

విజయనగరం: ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు పలువురు దూరం..!

image

కుటుంబంలో ఒకరికే సీటు కేటాయించడంలో పలువురు టీడీపీ సీనియర్లు పోటీకి దూరమయ్యారు. విజయనగరంలో కుమార్తెకు టికెట్ ఇవ్వడంతో అశోక్ గజపతిరాజు, బొబ్బిలిలో తమ్ముడు పోటీలో ఉండడంతో సుజయ్ కృష్ణ రంగారావు, గజపతినగరంలో అన్న కొడుకు అభ్యర్థి కావడంతో కొండపల్లి అప్పలనాయుడు, చీపురుపల్లి సీటు పెదనాన్నకు ఇవ్వడంతో కిమిడి నాగార్జున ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దాదాపు దూరం అయ్యినట్లే కనిపిస్తుంది.

Similar News

News March 7, 2026

జాతీయ స్థాయి బ్యాట్మింటన్ పోటీలకు బొబ్బిలి వాసులు

image

విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీల్లో బొబ్బిలి పట్టణానికి చెందిన రమేష్ , వాసు 35
ఏళ్ల కేటగిరిలో పాల్గొని విజేతలుగా నిలిచారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నారు. వీరిని బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం సత్కరించి, అభినందించారు. బొబ్బిలికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.

News March 6, 2026

చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో డెడ్ బాడీ కలకలం

image

చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లే స్థితికి చేరుకుండడంతో మూడు రోజుల క్రితం ప్రమాదం జరగవచ్చన్నారు. మృతుడు గల్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, చేతిపై ఓ పచ్చబొట్టు ఉందన్నారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.

News March 6, 2026

VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

image

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్‌ఓ మురళీ, తదితరులున్నారు.