News August 9, 2025

KNR: వ్యవసాయ రంగంలో జిల్లాకు 2 జాతీయ అవార్డులు

image

వ్యవసాయ రంగంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో కరీంనగర్ జిల్లాకు రెండు అవార్డులు దక్కాయి. “ఇండో అగ్రి”, “సస్టైనబిలిటీ మ్యాటర్స్” సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన “సస్టైనబుల్ అగ్రికల్చర్ సమ్మిట్”లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తరఫున జిల్లా అధికారులు ఈ అవార్డులు అందుకున్నారు. వ్యవసాయ శాఖలో దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఎంపిక కావడం గమనర్హం.

Similar News

News September 1, 2025

కరీంనగర్ జిల్లాకు మొండిచేయి

image

సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు (నంబరు 20101/02)కు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో కూడా హాల్టింగ్ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. జమ్మికుంటలో హాల్టింగ్ కల్పిస్తే.. HZBD, HSNB, పరకాల, భూపాలపల్లి, మానకొండూరు ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలగనుంది. సమస్యపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చొరవ చూపాలని కోరుతున్నారు.

News September 1, 2025

కరీంనగర్: ‘సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి’

image

కరీంనగర్‌లో ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి పెరిగింది. నీటి మట్టం పెరగడంతో పాటు ఆదివారం కావడం వల్ల సాయంత్రం పెద్ద సంఖ్యలో కట్టపై నుంచి రిజర్వాయర్ లోకి వెళ్లారు. ప్రమాదకరంగా నీటిలోకి వెళ్ళి గడిపారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చేరుకుని సందర్శకులను అక్కడి నుండి పంపించేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

News August 31, 2025

కరీంనగర్‌కి గర్వకారణం.. జాతీయ అవార్డు పొందిన రామకృష్ణ, సునీత

image

ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నేడు AP లోని నర్సరావుపేటలో తెలుగు భాష దినోత్సవం సందర్బంగా తెలుగు భాష, సంస్కృతి, వైభవం, సాహిత్యం తదితరాల్లో విశేష సేవలను అందిస్తున్నందుకు గాను తెలుగు తేజం పురస్కార అందిస్తుంది. ఇందులో భాగంగా SRR కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, చిందం సునీత జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.