News August 9, 2025
ఛార్జీలు పెంచలేదు: TGSRTC

TG: రాఖీ పండుగ సందర్భంగా RTC బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని, వాటిలో మాత్రమే 30% అదనపు ఛార్జీలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రెగ్యులర్ బస్సుల్లో ఎలాంటి పెంపు లేదని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పండగలకూ ఈ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News August 9, 2025
OBCల క్రీమీలేయర్ను సవరించాలని ప్రతిపాదన

OBCల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని వెంటనే సవరించాలని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల పరిమితిని పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుత పరిమితి వల్ల చాలామంది రిజర్వేషన్లు, ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతున్నారంది. 2017లో వార్షిక పరిమితిని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు సవరించారని, దీనిని ప్రతి మూడేళ్లకోసారి సవరించాల్సి ఉందని గుర్తు చేసింది.
News August 9, 2025
మహేశ్ బర్త్డే.. రాజమౌళి సినిమాపై బిగ్ అప్డేట్

మహేశ్తో తెరకెక్కిస్తున్న సినిమాపై డైరెక్టర్ రాజమౌళి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోందని చెప్పారు. 2025 నవంబర్లో మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ‘ఇది ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటిది’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. మెడలో నందీశ్వరుడితో కూడిన త్రిశూలం లాకెట్ ధరించిన మహేశ్ ఛాతీ పిక్ షేర్ చేశారు. తమ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
News August 9, 2025
ICICI కొత్త కస్టమర్లకు బ్యాడ్న్యూస్

నెలవారీ కనీస సగటు నగదు నిల్వ నిబంధనలను ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. మెట్రో, అర్బన్ ఏరియాల్లోని కొత్త కస్టమర్లు ఆగస్టు 1 నుంచి తమ ఖాతాల్లో రూ.50వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. ఇక సెమీ అర్బన్లో రూ.25వేలు, గ్రామాల్లో రూ.5వేలు కొనసాగించాలి. నిబంధనలు పాటించకుంటే సగటు నిల్వ కొరతపై 6% లేదా రూ.500 ఏది తక్కువైతే దానిని పెనాల్టీ వేస్తారు.