News August 9, 2025
వరంగల్: మా అక్క మనసు మంచిది..!

మీరు పైన చూస్తుంది ‘పెళ్లై 40 ఏళ్లు.. అయినా రాఖీ మిస్ అవ్వను!’ అనే వార్తకు వచ్చిన <<17345550>>కామెంట్<<>> ఇది. హనుమకొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన అక్కతో ఉన్న బంధాన్ని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘రవాణా వ్యవస్థ లేని రోజుల్లో ఏ రాత్రికో, తెల్లవారుజామునో వచ్చి అక్క రాఖీ కట్టేది. మంచి మనసుతో మా అక్క 45 ఏళ్లుగా రాఖీ కడుతోంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నా’ అని ఓ తమ్ముడు ఎమోషనల్ అయ్యాడు.
Similar News
News August 9, 2025
గిరిజనుల పిల్లలను పాఠశాలలకు పంపాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న చెంచుగూడాలలోని తల్లిదండ్రులు వారి పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని పాఠశాలలకు పంపాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతి కోసం భుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
News August 9, 2025
ప్రజలకు కడప ఎస్పీ హెచ్చరిక

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ శనివారం తెలిపారు. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే వాట్సప్ కూడా హ్యాక్ కావొచ్చని, ఫోన్ హ్యాక్ అయితే మోసపోతామని చెప్పారు. ప్లే స్టోర్ తప్ప ఇతర వేదికల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
News August 9, 2025
నవీపేట్: రాఖీ కట్టుకొని వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి (అప్డేట్)

నవీపేట(M) <<17352294>>జగ్గారావు ఫారం సమీపంలో<<>> జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు బాసరకు చెందిన సాయిబాబుగా(19) పోలీసులు గుర్తించారు. అతను NZBలో ఉంటున్న తన అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి స్కూటీపై వెళ్తున్న క్రమంలో వేగంగా లారీని ఢీకొట్టాడు. దీంతో సాయిబాబు అక్కడికక్కడే మృతి చెందాడని SI తెలిపారు. స్కూటీ వెనకాల కూర్చున్న అరవింద్ అనే వ్యక్తికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.