News August 9, 2025
ICICI కొత్త కస్టమర్లకు బ్యాడ్న్యూస్

నెలవారీ కనీస సగటు నగదు నిల్వ నిబంధనలను ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. మెట్రో, అర్బన్ ఏరియాల్లోని కొత్త కస్టమర్లు ఆగస్టు 1 నుంచి తమ ఖాతాల్లో రూ.50వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. ఇక సెమీ అర్బన్లో రూ.25వేలు, గ్రామాల్లో రూ.5వేలు కొనసాగించాలి. నిబంధనలు పాటించకుంటే సగటు నిల్వ కొరతపై 6% లేదా రూ.500 ఏది తక్కువైతే దానిని పెనాల్టీ వేస్తారు.
Similar News
News August 9, 2025
2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

AP: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. దీని ప్రభావంతో 2రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News August 9, 2025
భారత్పై ట్రంప్ విధించిన 50% టారిఫ్స్ వల్ల ఏం జరుగుతుంది?

ఈ టారిఫ్స్ను భారత్ భరించదు. మన దేశ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే USలోని వ్యాపారులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాన్ని పూడ్చుకోడానికి వస్తువుల ధరలు పెంచుతారు. ఫలితంగా వాటిని కొనే అమెరికా కస్టమర్లే ఆ భారం భరించాల్సి ఉంటుంది. అయితే మన కంపెనీల ఎగుమతులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఇతర మార్కెట్లను అన్వేషిస్తోంది. నష్టాన్ని సబ్సిడైజ్ చేసే అవకాశం లేకపోలేదు.
News August 9, 2025
అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.