News August 9, 2025

టాప్-3లో ఏపీ, తెలంగాణ

image

ప్రజలకు సత్వర న్యాయం అందించడం, పటిష్ఠ పోలీసింగ్‌లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో నిలిచాయి. శాంతిభద్రతల్లోనూ AP, TG టాప్‌లో ఉన్నాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025లో వెల్లడైంది. 2019-24 కంటే AP ర్యాంక్ మెరుగుపడినట్లు తెలిపింది. శాంతిభద్రతలు, పోలీసింగ్ తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వగా.. 10కి 6.78 మార్కులతో కర్ణాటక మొదటి, 6.32 స్కోరుతో AP, 6.15 స్కోరుతో TG 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News August 9, 2025

నిర్మాతలతో కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలం

image

వేతనాల పెంపుపై <<17354311>>నిర్మాతలతో<<>> కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని, 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. ఫెడరేషన్‌ను విభజించేలా నిర్మాతల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పారు.

News August 9, 2025

పులివెందులలో గతంలో ఆ పరిస్థితి లేదు: ప్రత్తిపాటి

image

AP: ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో గతంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని చెప్పారు. రౌడీ ముఠాలను తరిమేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కడప(D) ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలిపారు. ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News August 9, 2025

PHOTOS: సెలబ్రిటీస్ రాఖీ సెలబ్రేషన్స్

image

రాఖీ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంబరాల్లో పాల్గొన్నారు. పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు రాఖీ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రకుల్ ప్రీత్, జెనీలియా, నిహారిక, సారా అలీ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.