News August 9, 2025

GWL: వాడవాడల రక్షాబంధన్ వేడుకలు

image

నడిగడ్డలోని గ్రామాలు, పట్టణాలు, వాడవాడలో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుకలకు సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్క చెల్లెళ్లు అన్నదమ్ములను కలిసి రాఖీలు కట్టారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆయన సోదరి, NHPS జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి అన్నపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

Similar News

News August 10, 2025

పార్వతీపురం: PGRS అర్జీల వివరాలు తెలుసుకోవచ్చు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మీకోసం వెబ్సైట్‌లోనూ అర్జీలు నమోదు చేయవచ్చని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

News August 10, 2025

డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం: పవన్

image

AP: డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సవాళ్లు ఎదురైతే ప్రణాళికబద్ధంగా అధిగమించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే రోడ్ల నిర్మాణాలపై పంచాయతీరాజ్ అధికారులతో వర్చువల్‌గా ఆయన సమావేశమయ్యారు. ‘అడవితల్లి బాట’ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు అవశ్యకతను తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News August 10, 2025

అనకాపల్లి: వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

గంజాయి మత్తులో వృద్ధురాలిని రాయితో కొట్టి చంపిన ఘటనలో నిందితుడు కుదర పవన్ సాయిని కే.కోటపాడు సీఐ అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించారని చీడికాడ ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున చీడికాడ(M) ఎల్బీ పట్నానికి చెందిన గండి పైడితల్లమ్మ అనే వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన పవన్ సాయి రాయితో కొట్టడంతో మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.