News August 9, 2025
ORRపై గేట్వే ఆఫ్ హైదరాబాద్: రేవంత్

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలతో నిర్మించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ సమీపంలో ORRపై గేట్వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు. ఓ వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి, బాపూ ఘాట్ వైపున ఐకానిక్ టవర్ నిర్మించేలా డిజైన్లు రూపొందించాలన్నారు. 2 నెలల్లో టెండర్లు పిలిచేలా పనులు వేగవంతం చేయాలని తెలిపారు.
Similar News
News August 10, 2025
భారీ వర్షాలు.. ప్రజలు సహకరించాలన్న మంత్రి పొన్నం

TG: వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పారు. కాస్త సమయం తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
News August 10, 2025
కమల్ తల నరికేస్తా.. సహనటుడి వార్నింగ్

సనాతన <<17297271>>ధర్మానికి<<>> వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటుడు కమల్ హాసన్ను సీరియల్ నటుడు రవిచంద్రన్ బెదిరింపులకు గురిచేశారు. కమల్ తల నరికివేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రవిచంద్రన్పై మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేసే ఆయుధం విద్య అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
News August 10, 2025
పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే: కడప ఎస్పీ

AP: ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్కు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘రెండు ప్రాంతాల్లో 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’ అని SP ఆదేశించారు.