News August 9, 2025
సర్కారీ భవనాలపై సోలార్ ప్యానెల్స్.. 7రోజుల్లో వివరాలు పంపాలి’

రాష్ట్రవ్యాప్తంగా GOVT. కార్యాలయాలపై యుద్ధప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక- ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, గ్రామపంచాయతీ నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల వివరాలు 7 రోజుల్లో పంపాలని కోరారు. ROFR భూములపై సోలార్ పంపు సెట్లు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నారు.
Similar News
News August 10, 2025
మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్

ఓట్ చోరీ జరిగిందన్న LOP రాహుల్ గాంధీ <<17330640>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని ECని డిమాండ్ చేస్తున్నాం. http://votechori.in/ecdemandను విజిట్ చేసి, లేదా 9650003420కు మిస్డ్ కాల్ ఇచ్చి మాకు మద్దతు తెలపండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
News August 10, 2025
APL: 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో విజయవాడ సన్షైనర్స్ ప్లేయర్ జహీర్ అబ్బాస్ సంచలనం నమోదు చేశారు. కాకినాడ కింగ్స్తో జరుగుతున్న మ్యాచులో 17 బంతుల్లోనే ఫిఫ్టీ బాదారు. 19 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 57 రన్స్ చేశారు. ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. జహీర్, తేజ(46*) విధ్వంసంతో విజయవాడ 195 పరుగులు చేసింది. కాకినాడ పరుగుల వేటలో పడింది.
News August 10, 2025
అలంపూర్ ఆలయ అర్చకులకు నోటీసులు

దేవాదాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్నందుకు గాను జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆలయ ఈవో పురేందర్ తెలిపారు. ఈ నెల 6న డోన్లో ఒక రాజకీయ నాయకుడి ప్రైవేట్ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారని, ఇది SMలో వైరల్ కావడంతో దేవాదాయశాఖ సీరియస్గా స్పందించిందని చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.