News March 31, 2024

రైతుకు ఆర్థికసాయం ప్రకటించిన కేసీఆర్

image

TG: ‘పొలంబాట’లో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ ఓ రైతుకు అండగా నిలిచారు. ‘పొలం ఎండిపోయింది. బిడ్డ పెళ్లి చేసేందుకు డబ్బుల్లేవు’ అని ఓ రైతు కేసీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన బీఆర్ఎస్ అధినేత ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Similar News

News October 6, 2024

రేపటి నుంచి యూనివర్సిటీలకు దసరా సెలవులు

image

కర్నూలు జిల్లాలోని యూనివర్సిటీలకు దసరా సెలవులు ప్రకటించారు. రాయలసీమ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ వీ.లోకనాథ తెలిపారు. 14వ తేదీ తిరిగి పునఃప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.

News October 6, 2024

ఇవాళ పాకిస్థాన్‌తో భారత్ పోరు

image

ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

News October 6, 2024

నేడు సింహవాహనంపై ఊరేగనున్న స్వామివారు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ఉ.8 నుంచి 10 గంటల వరకు స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు. రా.7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుడి అలంకారంలో ఊరేగనున్నారు.