News August 9, 2025

JGTL: తండ్రి సమాధికి రాఖీ కట్టిన కుమార్తె

image

గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బొమ్మెన మాధవి పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన తన తండ్రి రాజయ్య సమాధికి రాఖీ కట్టి తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసింది. రెండేళ్ల క్రితం రాజయ్య హఠాన్మరణం చెందారు. ఏటా తన తండ్రికి కూతురు రాఖీ కట్టడానికి వెళ్లేది. తండ్రి భౌతికంగా లేకపోవడంతో సమాధి వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. తద్వారా రక్షాబంధన్‌కు ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పింది.

Similar News

News August 13, 2025

ఈ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్నిగంటల్లో సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, ములుగు, నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేటలో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. HYDలోనూ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే వర్షం కురుస్తోంది.

News August 13, 2025

నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల పోలింగ్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

News August 13, 2025

పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.